News June 21, 2024

కృష్ణా: డిప్లొమా, ITI పాసైన వారికి ముఖ్య గమనిక

image

2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైన వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైన వారికి 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది.

Similar News

News October 5, 2024

APTDC ఛైర్మన్‌గా నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూకసాని

image

ఏపీ టూరిజం డెవలప్మెంట్ ఛైర్మన్‌గా డా.నూకసాని బాలాజీ శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ ఆటోన‌గ‌ర్‌లోని APTDC కార్యాలయంలో ఉదయం 10.50 గంటలకు APTDC ఛైర్మన్‌గా నూకసాని బాధ్యతలు స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌తోపాటు NDA కూటమి పక్షాల నేతలు పాల్గొంటారని పేర్కొన్నాయి.

News October 4, 2024

రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా రవినాయుడు బాధ్యతలు

image

ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌గా అనిమిని రవి నాయుడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతతో ముందుకు సాగుతానని తెలిపారు. తనతోపాటు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్నతలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

News October 4, 2024

కోడూరు: కనకదుర్గమ్మకు వెండి కవచం బహుకరణ

image

కోడూరు మండలం నరసింహపురం రోడ్డులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి వెండి కవచాన్ని బహుకరించారు. శుక్రవారం కోడూరు గ్రామానికి చెందిన పోతన ప్రసాద్ కుంటుంబ సభ్యులు రూ.1,01,116 విలువగల వెండి కవచం, చీర, సారే అమ్మవారికి బహుకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ఛైర్మన్ రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి కవచాన్ని అలంకరించారు.