News May 22, 2024
కృష్ణా: తమిళనాడు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నం.06089 తాంబరం- సత్రాగచ్చి ట్రైన్ను జూన్ 5 నుంచి జూలై 3 వరకూ ప్రతి బుధవారం, నెం.06090 సత్రాగచ్చి- తాంబరం ట్రైన్ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
Similar News
News October 1, 2024
విజయవాడలో వైసీపీ నేత ఇంటికి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్ని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భవానీపురంలోని ఆకుల నివాసానికి వచ్చిన పల్లంరాజును ఆకుల సాదరంగా ఆహ్వనించారు. గతం నుంచి ఆకుల శ్రీనివాస్ కుమారుతో ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో పల్లంరాజు ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి గతంలో చేసిన పోరాటాలు, ఉద్యమాల గురించి గుర్తు చేసుకున్నారు.
News October 1, 2024
గుంటూరు జిల్లాలో జూ.NTR ‘దేవర’ సక్సెస్ మీట్.?
జూ.ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా గత నెల 27న రిలీజై భారీ వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలంలో అక్టోబర్ 3న ఫంక్షన్ ఏర్పాటుకు సోమవారం నిర్వాహకులు స్థలాన్ని పరిశీలించినట్లు తెలుస్తోంది. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించనుండగా.. చిత్రయూనిట్ పాల్గొననున్నట్లు సమాచారం.
News October 1, 2024
కొలికపూడి వ్యాఖ్యలపై మీ కామెంట్.!
మహిళా ఉద్యోగులకు తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు అసభ్యకర సందేశాలు పంపారని తిరువూరు మం. చిట్టేలలో నిన్న మహిళలు ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు నిజమైతే అరెస్ట్ చేయాలని.. లేకపోతే వారికి శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అసత్య ఆరోపణలను నియోజకవర్గ ప్రజలు నమ్మరని చెప్పారు. మరోవైపు, ఆయన నిన్న రాత్రి దీక్ష చేపట్టగా.. అధిష్ఠానం ఆదేశాల మేరకు విరమించారు. కొలికపూడి చేసిన వ్యాఖ్యలపై మీ COMMENT.