News October 27, 2025
కృష్ణా: తుపాను నేపథ్యంలో.. ఈ జాగ్రత్తలు తీసుకున్నారా..?

తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్ల వద్దనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. పిల్లలకు పాలు, అవసరమైన వస్తువులు, నిత్యవసర సరుకులు కూరగాయలు సిద్ధం చేసుకోవాలి. విద్యుత్ అంతరాయం కలిగినా తుపాను అప్డేట్స్ తెలుసుకునేందుకు సెల్ ఫోన్స్ చార్జింగ్, ఇంట్లో వాటర్ ట్యాంకర్లు నిండుగా ఉంచుకోవాలి.
Similar News
News October 27, 2025
జూబ్లీహిల్స్లో ఎవరి పంతం నెగ్గుతుందో..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయమే కాదు PJR పిల్లల మధ్య కూడా నువ్వానేనా అన్నట్లుగా మారింది. స్థానిక ప్రజలకు PJR అంటే ఎనలేని అభిమానం. కాగా ఆయన కుమారుడు, మాజీ MLA విష్ణువర్ధన్ రెడ్డి BRSలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరనీయనని అంటున్నారు. PJR కుమార్తె, కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. BRSను ఓడగొడతామంటున్నారు. మరి ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.
News October 27, 2025
ఖమ్మం: పంట కోతలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

రాబోయే 2 రోజుల పాటు తుపాను ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంట కోతలు వాయిదా వేసుకోవాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 100% ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పంట నష్టం జరగకుండా టార్పాలిన్ కవర్లు సిద్ధం చేయాలని సూచించారు.
News October 27, 2025
ఎస్బీఐలో మరో 3,500 పోస్టుల భర్తీ

నిరుద్యోగులకు SBI గుడ్న్యూస్ చెప్పింది. 3,500 PO పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గత జూన్లో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించామని, ప్రస్తుతం 541 PO పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయని చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పోలుదాసు చెప్పారు. ఈ FYలోనే మరో 3వేల సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. త్వరలో వీటికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని PTI ఇంటర్వ్యూలో తెలిపారు.


