News October 30, 2025

కృష్ణా: తుపాన్ బాధితులకు సాయం.. ఏమేమి ఇస్తున్నారంటే.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొంథా తుపాను బాధితులు, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, వీవర్స్ కుటుంబాలకు ఆర్థిక సాయం, నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. పునరావాస కేంద్రాలలో ఒక్కరికి రూ. 1000 నుంచి రూ.3వేల వరకు నగదు, 50 కేజీల బియ్యం, పప్పు, పంచదార, కూరగాయలు వంటి నిత్యావసరాలను నేడు అందజేయనున్నారు. NTRలో 485 కుటుంబాలు, మత్స్యకారులకు చెందిన 1,488, కృష్ణాలో 35-37వేల కుటుంబాలను ఆర్థిక సాయం కోసం ఎంపిక చేశారు.

Similar News

News October 30, 2025

తుపాన్ సహాయక చర్యల్లో అధికారుల పనితీరు భేష్: కలెక్టర్

image

తుపాన్ సహాయక చర్యల్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లాలో మొత్తం 4,553 కుటుంబాలకు చెందిన 9,450 మందిని పునరావస కేంద్రాలకు తరలించి రక్షణ కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా కుటుంబానికి రూ.3 వేలు, నిత్యవసర సరకులు ప్రభుత్వం అందిస్తోందని, ఈ కార్యక్రమాన్ని తెనాలి నుంచి ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.

News October 30, 2025

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న ఇన్ ఫ్లో

image

తుపాన్ కారణంగా కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా తరలివస్తుంది. గురువారం ఉదయం 11 గంటల వరకు 2,74,263 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.9 అడుగులుగా ఉంది. దీంతో అన్ని కెనాల్స్ మూసివేసినట్లు అధికారులు తెలిపారు. నేటి సాయంత్రానికి దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు.

News October 30, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

image

TG: మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపేలా ఆదేశించాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసి సీఎం రేవంత్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించారంటూ అందులో పేర్కొంది. ​ఇది నియోజకవర్గంలోని ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆరోపించింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.