News March 20, 2024

కృష్ణా నదిలో మునిగి పదో తరగతి విద్యార్థి మృతి

image

కృష్ణా నదిలో మునిగి పదో తరగతి విద్యార్థి మృతిచెందిన ఘటన అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కర్లపూడి గ్రామానికి చెందిన అభిషేక్ (17) పదో తరగతి చదివి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. అభిషేక్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి స్నానానికి వైకుంఠపురం పుష్కరఘాట్‌కు వచ్చి నీట మునిగి చనిపోయాడు.

Similar News

News April 2, 2025

GNT: ఉద్యోగాల జాబితా విడుదల

image

గుంటూరు DMHO కార్యాలయం పరిధిలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు DMHO విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. DEO, LGS, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఫైనల్ మెరిట్ లిస్టును guntur.ap.gov.in లో అప్ లోడ్ చేసినట్లు తెలిపారు. ROR ప్రకారం లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు.

News April 2, 2025

GNT: రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

image

గుంటూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ముగియటంతో పట్టణంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్లో జవాబు పత్రాల మూల్యాంకనానికి ఏర్పాట్లు చేపట్టారు. ఏప్రిల్ 3 ప్రారంభించి 9వ తేదీలోగా మూల్యాంకనం పూర్తి చేయనున్నారు. జిల్లా 1.80 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి. మూల్యాంకనం కోసం అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్స్ వంటి వివిధ రకాల విధుల కోసం 643మంది ఉపాధ్యాయులను నియమించినట్లు DEO రేణుక తెలిపారు.

News April 2, 2025

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో అధికారుల ఎలర్ట్

image

నరసరావుపేటలో పచ్చి చికెన్‌ను తిని బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడి బాలిక మృతి చెందడంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాలిక ఇంటితో పాటు సమీప ప్రాంతాలలో నివసించే వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో తొలి బర్డ్ ఫ్లూ మృతి కేసు కావడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చికెన్ షాపుల్లో సైతం పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.

error: Content is protected !!