News July 18, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు అందించే “నేషనల్ టీచర్ అవార్డ్స్-2024″కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు https://nationalawardstoteachers.education.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియ అనంతరం సెప్టెంబర్ 4, 5 తేదీలలో అవార్డులు అందజేస్తామని పేర్కొంది.

Similar News

News August 31, 2024

గుడ్లవల్లేరు ఘటన.. కెమెరాల వెనక కథ ఇదేనా.?

image

గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో లేడిస్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కాగా, కళాశాలలో కొందరు విద్యార్థుల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరూ ప్రకాశం జిల్లాకు చెందిన వారు. వారు ఇద్దరి విషయం బయటకు రాకూడదనే కొందరు కావాలనే ఇలా చేయించినట్లు సమాచారం.

News August 31, 2024

భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాకు వరద, వర్షం ఒకే సారి చుట్టు ముట్టాయి. కృష్ణా నదిలో వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని కలెక్టరేట్లో 24 గంటలూ పని చేసేలా 0866-2575833 నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్ జి. సృజన తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే కంట్రోల్ రూంకు తెలియజేయాలని సూచించారు.

News August 31, 2024

కృష్ణా జిల్లాలో వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు

image

విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పాఠశాలకు జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ సెలవు ప్రకటించారు. శనివారం భారీ వర్షాల కారణంగా కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా మచిలీపట్నం నుంచి శనివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు.