News February 27, 2025

కృష్ణా: నేడే ఎమ్మెల్సీ పోలింగ్.. ఓటు వేశారా.?

image

కృష్ణా జిల్లాలో నేడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఈ విధంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 77 పోలింగ్ కేంద్రాలు ఉండగా 63,190 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 35,378, స్త్రీలు 27,807, ఇతరులు ఐదుగురు ఉన్నారు. నేడు ఎన్నికలు జరగగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ ఉండనుంది. 

Similar News

News April 21, 2025

కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

image

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.

News April 21, 2025

కృష్ణా: 131 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేత

image

జిల్లాలో 131 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు సైకిళ్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందించారు. మెడికల్ క్యాంప్‌ల ద్వారా గుర్తించిన వీరికి రూ.15లక్షలు విలువ చేసే ట్రై సైకిల్స్, ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరితోపాటు పాఠశాలల్లో సమానంగా చదువుకోవడానికి ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

News April 21, 2025

VJA ఆటోనగర్‌ లాడ్జీల్లో తనిఖీలు

image

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.

error: Content is protected !!