News April 22, 2025
కృష్ణా : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు – DRO

కృష్ణా జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్లో అధికారులతో ఆయన సమీక్షించారు.10 పరీక్షా కేంద్రాల్లో 4546 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.
Similar News
News September 8, 2025
జిల్లాలో యూరియా కొరతలేదు: అసిస్టెంట్ కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులెవరు ఆందోళన చెంద వద్దని జిల్లా(ట్రైని) అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జహీద్ తెలిపారు. మోపిదేవి మండలం పెదప్రోలు, కొక్కిలిగడ్డ పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. రైతుల నుంచి యూరియా పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ హరనాథ్, సొసైటీ ఛైర్మన్ నాదెళ్ల శరత్ చంద్రబాబు, రైతులు ఉన్నారు.
News September 8, 2025
కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ కృష్ణా: 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెడీ
☞ మచిలీపట్నం: పర్యాటకుల జేబులకు చిల్లు.!
☞ మోపిదేవిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
☞ గుడివాడ- కంకిపాడు రోడ్లో గుంతలో పడి వ్యక్తి మృతి
☞ మొవ్వలో రూ.1.70 లక్షల విలువైన యూరియా సీజ్
☞పోరంకిలో విజయవాడ ఉత్సవ్ సన్నాహక కార్యక్రమం
☞ జూపూడిలో మందు గుండు సామాగ్రి కలకలం
☞ అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యేకి వైసీపీలో కీలక పదవి
News September 7, 2025
కృష్ణా: 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెడీ

జిల్లాలో రైతులకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. ఆదివారం పామర్రు, గూడూరు మండలాల పర్యటన అనంతరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అధికారులతో సమావేశమై యూరియా స్థితిగతులపై సమీక్షించారు. అవసరమున్న రైతులకు ప్రాధాన్యతగా సరఫరా చేయాలని సూచించారు.