News June 30, 2024

కృష్ణా: ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా అగర్తల (AGTL), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07029 AGTL- SC ట్రైన్‌ను జూలై 5 నుంచి అక్టోబర్ 4 వరకు, నెం. 07030 SC- AGTL ట్రైన్‌ను జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయి.

Similar News

News September 20, 2024

విజయవాడ: బెయిల్ కోసం కాంతిరాణా టాటా పిటిషన్

image

సస్పెన్షన్‌లో ఉన్న IPS అధికారి కాంతిరాణా టాటా ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారణ జరపనున్నట్లు సమాచారం. కాగా కాదంబరి జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం కాంతి రాణా టాటాను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

News September 20, 2024

ఈ నెల 30న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు

image

కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున ఆ మార్గం గుండా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు విజయవాడ-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను(నం.12718 &12717) ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News September 20, 2024

కృష్ణా: ANU డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(Y23 బ్యాచ్) రెగ్యులర్ పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.