News February 22, 2026

కృష్ణా: బుక్స్ పేరుతో ముందస్తు దందా..!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల దందాను ముందే మొదలుపెట్టాయి. 9th పరీక్షలు ముగియగానే, టెన్త్‌లోకి వచ్చే విద్యార్థులు వచ్చే ఏడాదికి సంబంధించిన బుక్స్‌ను ఇప్పుడే కొనుగోలు చేయాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే బుక్స్ పేరుతో వేల రూపాయల వసూళ్లకు దిగడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News February 25, 2026

చెరకు పంటలో పీక, కాండం తొలుచు పురుగు ప్రభావం

image

చెరకు నాటిన దగ్గరి నుంచి నరికే వరకు ఈ పురుగులు పైరును ఆశిస్తాయి. బాల్య దశలో పీకపురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా పంటను నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధార చెరకుపై ఎక్కువగా ఉంటుంది. దీని ఉద్ధృతి ఎక్కువైతే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అందుకే ఈ పురుగుల విషయంలో నిర్లక్ష్యం వద్దని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News February 25, 2026

పార్వతీ దేవి అన్నపూర్ణగా ఎలా మారింది?

image

లోకానికి ఆహారం అందించే దేవత అన్నపూర్ణ దేవి. ఓసారి శివుడు ‘ఆహారం ఓ భ్రమ’ అన్నాడు. దీంతో కోపగించిన పార్వతీదేవి కాశీకి వెళ్లింది. దీంతో సకల జీవరాశులు ఆకలితో అలమటించాయి. అప్పుడు ఆహారం ప్రాముఖ్యం అర్థమైన శివుడు కాశీకి వెళ్లి అమ్మవారిని భిక్ష అడుగుతాడు. పరమేశ్వరుడికే అన్నం పెట్టడంతో ఆ తల్లి ‘అన్నపూర్ణ’గా ప్రసిద్ధి చెందింది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

News February 25, 2026

607 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌(NLCIL)లో 607 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి గడువు నేటితో ముగియనుంది. ఐటీఐ అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.11,040 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in