News April 11, 2025
కృష్ణా: రేపే ఇంటర్ ఫలితాలు.. ఉత్కంఠ

ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్కంఠతో ఉన్నారు. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఉద్విగ్నత కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో 1వ సంవత్సరం 24,557, 2వ సంవత్సరం 20,873 మంది మొత్తం 45వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
Similar News
News September 10, 2025
కృష్ణా : రీవాల్యూషన్ నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన యూజీ(హానర్స్) 8వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.8,00 ఫీజు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి.వీరబ్రహ్మచారి సూచించారు
News September 9, 2025
కృష్ణా: బ్యూటిఫుల్ మూన్

బాపులపాడు గన్నవరం ఉంగుటూరు మండలాలలో ఆకాశం తన అందాలతో మంగళవారం రాత్రి మాయ చేసింది. నింగిలో మెరిసిన నిండు చంద్రుడు ప్రజల చూపులను కట్టిపడేశాడు. వెండి వెలుగులు విరజిమ్ముతూ ప్రకృతి తన మహిమను ఆవిష్కరించింది. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఆ వెన్నెల విందు చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బయటకు వచ్చి చిత్రాల్లాంటి దృశ్యాలను కెమెరాలో బంధించారు. మరి మీ ప్రాంతంలో ఈరోజు చంద్రుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి.
News September 9, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు: కృష్ణా ఎస్పీ
☞ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 105 R&B రోడ్లు ధ్వంసం
☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం
☞ మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైనుకు కృషి చేయాలి: బాలశౌరి
☞ మోపిదేవి ఆలయంలో భక్తుల రద్దీ