News June 26, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
చాగల్లు-రాజమండ్రి సెక్షన్ల మధ్య ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన విజయవాడ- కాకినాడ పోర్ట్ మెము ఎక్స్ప్రెస్ రైళ్లను యధావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17257 విజయవాడ- కాకినాడ పోర్ట్, నం.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ రైళ్లను యధావిధిగా నడుపుతామన్నారు.
Similar News
News September 29, 2024
సీఎం చంద్రబాబుతో సిద్దార్థనాథ్ సింగ్ భేటీ
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత సిద్దార్థనాథ్ సింగ్ శనివారం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం గత 100 రోజులుగా రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి సీఎంతో చర్చించానని సిద్దార్థనాథ్ సింగ్ ట్విట్టర్(X)లో పోస్ట్ చేశారు.
News September 29, 2024
కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో LLM కోర్సు విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. అక్టోబర్ 15,16,17 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
News September 28, 2024
విజయవాడ: మధ్యాహ్న భోజన పథకం అమలుపై వర్క్షాప్
కలెక్టర్ జి.సృజన శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో విజయవాడ కలెక్టరేట్లో వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్లో DSEO యూవీ సుబ్బారావు, న్యూట్రిషనిస్ట్ డా.సుష్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలు, తదితర అంశాలపై కలెక్టర్ జి. సృజన క్షేత్రస్థాయి అధికారులకు పలు కీలక సూచనలిచ్చారు.