News February 15, 2026

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.08581 VSKP- SMVB రైలు మార్చి 1 నుంచి 29 వరకు ప్రతి ఆదివారం, నం.08582 SMVB- VSKP మధ్య నడిచే రైలు మార్చి 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఆదివారం ప్రకటించారు.

Similar News

News February 16, 2026

బీజేపీ నేతకు హీరోయిన్ త్రిష వార్నింగ్

image

అనవసర వివాదాల్లోకి తనను లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవని హీరోయిన్ త్రిష హెచ్చరించారు. తమిళ హీరో విజయ్‌ని ఉద్దేశించి తనపై బీజేపీ నేత <<19138607>>నాగేంద్రన్<<>> చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ప్రతిష్ఠను దెబ్బతీశారన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నాగేంద్రన్ వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయని త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 16, 2026

మరో పాన్‌ఇండియా మూవీలో సూపర్ స్టార్?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్‌లు హోంబలే ఫిల్మ్స్, సన్ పిక్చర్స్ నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీని తెరకెక్కించేందుకే వీరి సమావేశం జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కాగా రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ కానుంది.

News February 16, 2026

బిల్‌ గేట్స్‌ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న కలెక్టర్

image

అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో కలిసి బిల్‌ గేట్స్‌ బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎన్ఐసీ భవనం నుంచి జిల్లా కలెక్టర్‌ ఆనంద్, జాయింట్ కలెక్టర్‌ విష్ణుచరణ్‌ వర్చువల్ విధానంలో ఈ భేటీకి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పాలనలో సాంకేతికతను జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసింది.