News December 25, 2025
కృష్ణా: రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

ఏ కొండూరు మండలం గోపాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన భూక్య కమల (40) రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూశారు. కమల మృతితో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
Similar News
News January 7, 2026
25 రన్స్ చేస్తే సచిన్ను దాటనున్న కోహ్లీ!

ఈ నెల 11న ప్రారంభమయ్యే NZతో వన్డే సిరీస్లో సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టే అవకాశాలున్నాయి. మరో 25 పరుగులు చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లో వేగంగా 28వేల పరుగులకు చేరుకున్న క్రికెటర్గా నిలవనున్నారు. కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్లో 27,975 రన్స్ చేశారు. మరోవైపు 28వేల రన్స్ మైలురాయిని అందుకోవడానికి సచిన్కు 644 ఇన్నింగ్స్ అవసరం కాగా, సంగక్కర 666 ఇన్నింగ్స్ ఆడారు.
News January 7, 2026
BREAKING.. కొవ్వూరు జాతీయ రహదారిపై దగ్ధమైన బస్సు

తూ.గో. జిల్లా కొవ్వూరు గామాన్ బ్రిడ్జి సమీపంలోని జాతీయ రహదారిపై ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. తెల్లవారు జామున 3గం.కు బస్సు సెల్ఫ్ మోటార్లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు.
News January 7, 2026
US బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

ఇటీవల వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ వేళ US ఆర్మీ చేసిన మెరుపుదాడిలో 55 మంది వెనిజులా, క్యూబా సైనికులు చనిపోయినట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. వీరిలో వెనిజులాకు చెందిన 23, క్యూబా సైనికులు 32మంది ఉన్నట్లు పేర్కొన్నాయి. మృతిచెందిన తమ సైనికుల వయసు 26-27ఏళ్ల మధ్య ఉంటుందని క్యూబా చెప్పింది. అటు ఈ దాడుల్లో మదురో భద్రతా సిబ్బంది చాలా వరకు చనిపోయినట్లు వెనిజులా రక్షణ మంత్రి పాడ్రినో లేపెజ్ తెలిపారు.


