News August 24, 2025

కృష్ణా: వర్షాలకు రోడ్లు ధ్వంసం.. నష్టం ఎంతంటే.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. R&B అధికారుల అంచనాల మేరకు.. మొత్తం 333.32 కి.మీ మేర రోడ్లు పాడయ్యాయి. 14 రోడ్లు పూర్తిగా కొట్టుకుపోగా, ఒక రోడ్డు బాగా దెబ్బతింది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ఖర్చుల వివరాలు ఇలా ఉన్నాయి. తాత్కాలిక మరమ్మతులకు రూ. 33.09 కోట్లు, శాశ్వత పరిష్కారానికి రూ. 251.38 కోట్లు. ఈ నివేదికను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.

Similar News

News August 24, 2025

తిరుపతి: ఒక్కడే 53 బైకులు దొంగలించాడు!

image

తిరుపతిలో బైకులను మాయం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచానూరుకు చెందిన P.కుమార్ సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తుంటాడు. జల్సాలకు అలవాటై దొంగతనాలు చేస్తున్నాడు. పాత రేణిగుంట రోడ్డులో జులై 6న బైక్ దొంగతనం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేయగా కుమార్ పట్టుబడ్డాడు. తిరుపతి, చంద్రగిరి, ఏర్పేడు, శ్రీకాళహస్తి పరిధిలో రూ.40 లక్షల విలువైన 53 బైకులు దొంగలించగా వాటిని పోలీసులు రికవరీ చేశారు.

News August 24, 2025

KNR: కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ROUTE MAP

image

తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన సాయంత్రం రెండో విడత జనహిత పాదయాత్ర గంగాధర మం. ఉప్పరమల్యాల గ్రామం నుంచి కురిక్యాల వరకు, కురిక్యాల నుంచి మధురానగర్ X రోడ్ వరకు జరగనుంది. అనంతరం సాయంత్రం 7 గంటలకు మధురానగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుందని చొప్పదండి MLA సత్యం తెలిపారు. మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొన్నం, అడ్డూరి, వివేక్ తదితరులు పాల్గొననున్నారు.

News August 24, 2025

నరసన్నపేట: ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు

image

నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ జిల్లా జేడీ త్రినాథ స్వామి తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆదివారం జరిగిన ఈ సోదాల్లో ఏడీ వెంకట మధు, ఏవో సూర్య కుమారిలు ఉన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేడీ దుకాణదారులకు హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఎల్లవేళలా ఎరువులు ఉంచాలన్నారు.