News October 9, 2025

కృష్ణా: సచివాలయ ఉద్యోగులకు.. ఇది అయ్యే పనేనా?

image

CM చంద్రబాబు ప్రతిష్టాత్మక P4 పథకం ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో 99,889, కృష్ణా జిల్లాలో 78,766 మంది పేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. తొలి విడతలో ఎన్టీఆర్‌లో 64,390, కృష్ణాలో 31,967 మందిని దాతలు దత్తత తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరించి, లబ్ధిదారులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఇప్పటికే వివిధ సేవలతో ఉద్యోగులపై భారం పెరుగుతుందని ప్రజలు అంటున్నారు.

Similar News

News October 9, 2025

నర్సీపట్నం కాదు.. హైకోర్టుకు వెళ్లండి: TDP

image

AP: మాజీ CM జగన్‌ నర్సీపట్నం పర్యటనపై TDP సెటైర్లు వేసింది. నర్సీపట్నం కాకుండా హైకోర్టుకు వెళ్లి లాజిక్కులు చెప్పాలని సూచించింది. PPP మోడల్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసింది. ‘PPP మోడల్‌లో వైద్య కళాశాలలు నిర్మించే అంశంలో జోక్యం చేసుకోలేం. అలా నిర్మిస్తే తప్పేంటి? ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటే మంచిదే కదా’ అని కోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఉన్న వార్తను ట్వీట్ చేసింది.

News October 9, 2025

కాకినాడ: పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌.. ఫొటోలు వైరల్

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత అధికారిక కార్యక్రమంలో క్యాజువల్‌ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా తెల్లటి దుస్తుల్లో కనిపించే పవన్ గురువారం కాకినాడ పర్యటన సందర్భంగా క్యాజువల్‌ దుస్తులు, గాగుల్స్ ధరించారు. రియల్ లైఫ్‌లోనూ స్టైలిష్‌గా ఉన్న ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News October 9, 2025

వరంగల్: రూ.800 పెరిగిన వండర్ హట్ మిర్చి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తేజా మిర్చి(ఏసీ) క్వింటాకు రూ.14,700 ధర పలకగా.. ఈరోజు రూ.14,500కి తగ్గింది. 341 రకం మిర్చి(ఏసీ)కి నిన్న రూ.16,200 ధర వస్తే.. నేడు రూ.16,300 అయ్యింది. మరోవైపు వండర్ హాట్(WH) ఏసీ మిర్చికి బుధవారం రూ.16 వేలు ధర వస్తే.. గురువారం రూ.16,800 అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.