News July 18, 2024

కృష్ణా: హత్య కేసులో ట్విస్ట్… హంతకురాలు తల్లే

image

పమిడిముక్కల మండలం తాడంకిలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం పోలీస్ స్టేషన్‌‌లో సీఐ కిషోర్ బాబు, ఎస్ఐ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. తాడంకి  గ్రామానికి చెందిన రాంబాబును పచ్చడి బండతో తలపై కొట్టి తల్లి హత్య చేసిందన్నారు. తాగిన మత్తులో పలుమార్లు తల్లిపై అసభ్యంగా ప్రవర్తించిన కుమారుడిని హత్య చేసిన తల్లి పద్మను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామన్నారు.  

Similar News

News October 14, 2024

నేడు కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్.. పర్యటన వివరాలివే.!

image

కృష్ణా జిల్లా కంకిపాడులో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాగా ఆయన పర్యటన వివరాలను కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 10 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి కంకిపాడుకి చేరుకుంటారు. అనంతరం 10 నుంచి 11:30 వరకు కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11:30కి కంకిపాడు నుంచి రోడ్డు మార్గాన మంగళగిరి డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

News October 14, 2024

విజయవాడలో 16న వాలీబాల్ జట్ల ఎంపికలు

image

స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో అక్టోబర్ 16న వాలీబాల్ జట్ల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీను, ఎస్.శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ ఎంపికలు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలురకు మాత్రమే జరుగుతాయన్నారు. జిల్లాలో ఆసక్తి గల బాలురు ఉదయం 9 గంటలకు జిల్లా ఎస్జీఎఫ్ ఎంట్రీ ఫామ్‌తో హాజరుకావాలన్నారు.

News October 13, 2024

విజయవాడలో సందడి చేసిన ‘మిస్టర్ బచ్చన్’ హీరోయిన్

image

విజయవాడలో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సందడి చేశారు. ఓ నగల దుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. షోరూమ్‌ను విజయవాడ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని భాగ్యశ్రీ అన్నారు. దీంతో ఆమెను చూడటానికి ప్రజలు భారీగా ఎగబడ్డారు.