News June 30, 2024
కృష్ణా: B.A. LL.B కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A.LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన ఎనిమిదవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 24, 26, 29, 31, ఆగస్టు 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
Similar News
News September 20, 2024
విజయవంతంగా ముగిసిన టూరిజం కాన్క్లేవ్-2024
విజయవాడ నోవాటెల్ హోటల్లో జరిగిన “ఏపీ- వియత్నాం టూరిజం కాన్క్లేవ్- 2024” శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సదస్సులో వియత్నాం తరపున ముఖ్య అతిథిగా హాజరైన హెచ్.ఈ.ఎంగ్యూయేన్కు రాష్ట్రంలోని పర్యాటక రంగ అంశాలను మంత్రి దుర్గేష్ వివరించారు. భవిష్యత్తులో ఏపీ- వియత్నాం మధ్య పర్యాటక, సాంస్కృతిక బదిలీకి మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని హాజరైన వియత్నాం ప్రతినిధులు హామీ ఇచ్చారు.
News September 20, 2024
విజయవాడలో వ్యభిచారం
బాడీ మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. మాచవరం సీఐ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రినగర్లో బాడీ మసాజ్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం దాడి చేశామన్నారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలను, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News September 20, 2024
అడుసుమిల్లి మృతిపై జగన్ దిగ్భ్రాంతి
మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి జయప్రకాశ్ మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జై ఆంధ్ర ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని జగన్ గుర్తు చేసుకున్నారు. జయప్రకాశ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.