News September 13, 2025
కృష్ణ: కర్ణాటక బస్సును ఢీకొని వ్యక్తి మృతి

కర్ణాటక బస్సును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన శుక్రవారం కృష్ణ మండలంలో కృష్ణ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. కృష్ణ ఎస్సై నవీద్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తినగర్ గ్రామానికి చెందిన సుగర్ రెడ్డి(40) టై రోడ్డు నుంచి శక్తినగర్కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కర్ణాటక బస్ను ఢీకొన్నాడు. ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో చనిపోయాడు.
Similar News
News September 13, 2025
నెల్లూరులో యువతి దారుణ హత్య!

నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ సెంటర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురు ఇంట్లో ఉంటూ చనువుగా ఉండేవారు. గత అర్ధరాత్రి యువకుడితో మాట్లాడడానికి ఆ యువతి వెళ్లింది. ఈ క్రమంలో యువతిని పొడిచి చంపిన యువకుడు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 13, 2025
3,115 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ

ఈస్టర్న్ రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే(SEP 13) చివరితేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, పెయింటర్, లైన్మెన్, వైర్మెన్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్, ఉద్యోగాన్ని బట్టి ఐటీఐలో పాసవ్వాలి. వయసు 15-24ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్సైట్: <
News September 13, 2025
HYD: నేడు, రేపు MSME బిజినెస్ ఎక్స్పో

BNI హైదరాబాద్ ప్రతినిధులు అనిరుధ్ కొణిజేటి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సెప్టెంబర్ 13, 14న శంషాబాద్లో MSME ఎక్స్పో నిర్వహిస్తామని తెలిపారు. BNI ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్పోలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించబడనున్నట్లు వివరించారు. ఎక్స్పో విశేషాలను సీఎంకు వివరిస్తామని చెప్పారు.