News March 7, 2025
కేంద్ర ఐటీ చట్టం పౌరుల గోప్యతకు ముప్పు: KTR

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టం పౌరుల డిజిటల్ గోప్యతకు ముప్పు అని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. నూతన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారలున్నాయని, నూతన చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కాలరాస్తుందన్నారు. ఇది దేశ ప్రజల డిజిటల్ హక్కులపైన కేంద్రం చేస్తున్న దాడి, దేశ ప్రజలు, విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 4, 2025
ASF: మహిళల భద్రతకు షీ టీమ్స్: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలు, యువతుల భద్రత కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు. అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ద్వారా 87 హాట్స్పాట్లను గుర్తించి, 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో 16 మంది అకతాయిలను పట్టుకుని, ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
News November 4, 2025
మంచిర్యాల: మత్స్యకారుల సంక్షేమం దిశగా చేప పిల్లల పంపిణీ

రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడి పరిశ్రమల,క్రీడా యువజన శాఖ మంత్రి శ్రీహరి అన్నారు. Hyd నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ..223.93లక్షల చేప పిల్లల పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
News November 4, 2025
పోలీస్ పీజీఆర్ఎస్కు 105 పిటిషన్లు: ఎస్పీ

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.


