News February 2, 2025
కేంద్ర బడ్జెట్పై కరీంనగర్ MP ప్రశంసలు
కేంద్ర బడ్జెట్ 2025-26 కేవలం లెక్కల పద్దు మాత్రమే అని, ఇది ప్రధాని మోదీ దార్శనికత, స్వావలంబన, వృద్ధి, శ్రేయస్సుతో కూడిన వికసిత భారత్కు ఒక రోడ్ మ్యాప్ అని కరీంనగర్ MP, కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రైతు సంక్షేమం, మధ్యతరగతికి ఉపశమనం, మహిళలు, యువతకు సాధికారత కల్పించడం, స్టార్టప్లకు ప్రోత్సాహం వంటివి ఈ బడ్జెట్లో చూడవచ్చన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులను ప్రోత్సహించారని వివరించారు.
Similar News
News February 2, 2025
కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం
మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.
News February 2, 2025
తెలుగులో అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్
*ప్రషు బేబీ- 11.4 మిలియన్స్
*హర్ష సాయి ఫర్ యూ తెలుగు- 10.9M
*తేజ్ ఇండియా- 5.56 M
*ఫిల్మిమోజి (ఎంటర్టైన్మెంట్)- 5.31M
*షణ్ముఖ్ జశ్వంత్- 4.93M.
*ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు- 4.73M
*శ్రావణి కిచెన్- 4.7M
*బ్యాంకాక్ పిల్ల- 3.61M
*అమ్మచేతి వంట- 3.52M
*మై విలేజ్ షో- 3.1M
*మీడియాకు మినహాయింపు. ఇవి పర్సనల్ ఛానల్స్.
News February 2, 2025
బెల్లంపల్లి: 3 రోజులుగా ఆ పరిసరాల్లోనే పెద్దపులి
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు బుగ్గగూడెం పరిసర అటవీ ప్రాంతాల్లో గత 3రోజులుగా పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారి పూర్ణచందర్ తెలిపారు. పులి జాడ తెలుసుకునేందుకు 5చోట్ల కెమెరాలు అమర్చినట్లు అధికారి వివరించారు. కానీ కెమెరాల్లో పెద్దపులి చిక్కలేదని వివరించారు. కాగా ఆదివారం ఉదయం పులి తిరుగుతున్న పాదముద్రలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.