News February 2, 2025
కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం: అనంత వెంకటరామిరెడ్డి
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసినా కూటమి నాయకులు మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు.
Similar News
News February 2, 2025
హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే ప్రాణాలు సురక్షితం: ఎస్పీ జగదీశ్
హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలు సురక్షితమని.. ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణం చేయాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతుండటం మనం చూస్తున్నామన్నారు. ఈ విచార ప్రమాద ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.
News February 1, 2025
అనంతపురం జిల్లాలో పింఛన్ పంపిణీలో సర్వర్ సమస్య
అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కానుక పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటల నుంచి పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తోందని తెలిపారు. స్మార్ట్ ఫోన్లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
News February 1, 2025
అమానుష ఘటన.. మరో 8 మంది అరెస్ట్
ప్రేమజంట పారిపోవడానికి సాయం చేసిందని ఆరోపిస్తూ బాలిక బంధువులు ఓ మహిళను వివస్త్రను చేసి, జుట్టు కత్తిరించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గత నెల 15న మునిమడుగులో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో 8 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు. ఇప్పటి వరకు 20మంది నిందితులను అనంతపురం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.