News April 3, 2025

కేంద్ర మంత్రిని కలిసిన ADB ఎంపీ, ఎమ్మెల్యేలు

image

ఆదిలాబాద్ జిల్లాలో విమానాశ్రయానికి భారత వైమానిక దళం ఆమోదం తెలపడం పట్ల ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని కలిసి సత్కరించారు. వీలైనంత త్వరగా ADB విమానాశ్రయం అభివృద్ధి చేసి పౌర విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

Similar News

News February 13, 2026

నేరేడుచర్ల: కౌన్సిలర్లుగా గెలిచిన భార్యాభర్తలు

image

నేరేడుచర్ల మున్సిపాలిటీ ఫలితాలలో భార్య భర్తలు ఇద్దరు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి 4వ వార్డు అభ్యర్థిగా కొణతం మంజుల, 15వ వార్డు అభ్యర్థిగా కొణతం చిన్న వెంకట్ రెడ్డి ఇద్దరూ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. గెలుపునకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. వారికి పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News February 13, 2026

నీట్ ర్యాంకులతో B.Sc నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు

image

AP: నాలుగేళ్ల B.Sc (నర్సింగ్) కోర్సులో ప్రవేశాలను నీట్-UG పరీక్ష ర్యాంకుల ఆధారంగా కల్పించాలని GOVT నిర్ణయించింది. గతంలో ఇంటర్, ఈఏపీసెట్ ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు జరగ్గా గత ఏడాది APNCET పెట్టారు. అయితే 16000 సీట్లకు గాను 4000 మిగిలిపోయాయి. దీంతో వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తాజా ప్రతిపాదనలు సమర్పించగా CM ఆమోదించారు. ఈ కోర్సులో ప్రవేశాలు కోరుకొనే వారు 2026-27 నుంచి నీట్-UG పరీక్ష రాయాల్సి ఉంటుంది.

News February 13, 2026

BIG BREAKING: గజ్వేల్: KCR ఇలాకాలో BRS గెలుపు

image

మాజీ సీఎం KCR ఇలాకా గజ్వేల్‌లో BRS విజయం సాధించి మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంది. ఇక్కడ 20 వార్డులకు గాను 11 వార్డులు BRS సాధించింది. 7 వార్డులు కాంగ్రెస్, 1 వార్డు బీజేపీ, 1 వార్డు ఇతరులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 11 సాధించడంతో BRS మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.