News June 17, 2024

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే

image

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ.. నిబద్దతతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన నాయకులను పార్టీ గుర్తిస్తుందన్నారు. దానికి కిషన్ రెడ్డి నిదర్శనమని కొనియాడారు.

Similar News

News October 6, 2024

నిజామాబాద్‌కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తోంది: మహేశ్ కుమార్

image

నిజామాబాద్‌కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన NZBలో మీడియాతో చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. హైడ్రా తరహా నిడ్రా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వయనాడ్‌గా హైదరాబాద్ పరిస్థితి మారకూడదంటే మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు.

News October 5, 2024

NZB: హరీశ్ రావు మాట తప్పారు: మహేష్ కుమార్ గౌడ్

image

రుణ మాఫీ విషయంలో బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు రాజీనామా చేస్తానని చెప్పి మాట తప్పారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన రుణమాఫీ, కాంగ్రెస్ తొమ్మిది నెలలు జరిగిన రుణమాఫీపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కొండా సురేఖ వివాదంపై మాట్లాడుతూ.. అది ముగిసిన వివాదం అన్నారు.

News October 5, 2024

NZB: GREAT.. ఒకేసారి ఐదు ఉద్యోగాలు

image

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి చెందిన మంచిప్ప గ్రామ యువతి తూర్పు అర్చన ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించింది. ఏఈ, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, టీపీడీఓ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తూర్పు అర్చన మాట్లాడుతూ.. తాను సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని తన భర్త రాకేష్ సాకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని తెలిపారు.