News February 4, 2025

కేంద్ర మంత్రులను కలిసిన బీజేపీ NZB అధ్యక్షుడు

image

బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన దినేష్ కులచారి మంగళవారం కేంద్ర మంత్రులను మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను ఢిల్లీలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు కులచారికి సూచించారు.

Similar News

News February 4, 2025

ఆర్మూర్: మెరుగైన వైద్య సేవలందించాలి: DMHO

image

నిజామాబాద్ జిల్లా DMHO రాజశ్రీ మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఆసుపత్రి రిజిస్టర్లను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే వైద్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా ఫిర్దోస్, డాక్టర్ ప్రవీణ్, ఆనంద్, LT కృష్ణ, ఫార్మసిస్టు సురేశ్, తదితరులు ఉన్నారు.

News February 4, 2025

NZB: రైతును బురిడీ కొట్టించి నగదు స్వాహా

image

రైతును బురిడీ కొట్టించి ఓ కేటుగాడు ATM కార్డు ద్వారా నగదు స్వాహా చేసిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. మోపాల్ మండలానికి చెందిన గంగారెడ్డి అనే రైతు రెండు రోజుల కిందట నిజామాబాద్‌లోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లి అక్కడ ఉన్న ఓ వ్యక్తి సహాయంతో రూ.5 వేలు డ్రా చేశాడు. ఈ సమయంలో ఆ కేటుగాడు వేరే కార్డు ఇచ్చి రైతును మోసం చేసి అనంతరం రూ.30 వేలు డ్రా చేశాడు. మేసేజ్‌లు రావడంతో రైతు పోలీసులను ఆశ్రయించారు.

News February 4, 2025

NZB: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

image

శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఇందులో భాగంగా బోధన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

error: Content is protected !!