News April 9, 2025
కేజీహెచ్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కేజీహెచ్లో విశాఖ కలెక్టర్ హరేంద్రప్రసాద్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు వార్డులను సందర్శించారు. అనంతరం ఓపీ గేటు వద్ద రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రోగులకు, సహాయకులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూపరింటెండెంట్ శివానంద్ను ఆదేశించారు.
Similar News
News April 17, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ జనసేనలో చేరిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు ➤వైసీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రియాంక➤కలెక్టరేట్లో దిశా మీటింగ్ నిర్వహించిన ఎంపీ భరత్ ➤ఈ నెల 24 నుంచి సింహాద్రి అప్పన్న చందనం అరగదీత ➤పలు హాస్టల్లో తనిఖీలు చేసిన మంత్రి డోలా ➤ POCSO చట్టంపై అవగాహన కల్పించిన హోంమంత్రి ➤ APR 30 వరకు పన్ను వడ్డీపై 50% రాయితీ ➤దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రోగ్రాంకు అనుమతి ఇచ్చిన పోలీసులు
News April 17, 2025
వైసీపీకి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక రాజీనామా

జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక YCPకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నానని అధినేత జగన్కు లేఖ పంపారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరనున్నది అనేది తెలపలేదు. కాగా ఇవాళ ముగ్గురు YCP కార్పొరేటర్లు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 19న మేయర్పై అవిశ్వాసం పెట్టనున్న నేపథ్యంలో నంబర్ గేమ్ ఉత్కంఠగా మారింది.
News April 17, 2025
వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎంపీ

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు సులభంగా పొందవచ్చని విశాఖ ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్లో వాట్సాప్ గవర్నెన్స్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెంబరుకు హాయ్ అని మెసేజ్ పెట్టి ప్రజలకు కావాల్సిన సేవను ఎంపిక చేసుకోవచ్చన్నారు.