News March 13, 2025
కేటిదొడ్డి: ‘చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి’

నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎడమ కాలువ 104వ ప్యాకేజీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గురువారం కేటిదొడ్డి మండలం గువ్వలదిన్నె, కొండాపురం, మైలగడ్డ గ్రామాల వద్ద సాగునీటి ఆవశ్యకత గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువలను పరిశీలించారు. రైతుల అభ్యర్థన మేరకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
Similar News
News March 13, 2025
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు రేపు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
News March 13, 2025
స్పీకర్ను కించపరచలేదు.. ప్రభుత్వాన్ని నిలదీశా: జగదీశ్ రెడ్డి

TG: అసెంబ్లీలో తాను స్పీకర్ను కించపరచలేదని, ప్రభుత్వాన్ని నిలదీశానని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో కేటీఆర్, హరీశ్రావుతో కలిసి ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. సభలో అందరికీ సమాన హక్కులుంటాయని మాత్రమే తాను చెప్పినట్లు పేర్కొన్నారు. స్పష్టమైన కారణం లేకుండా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఇంకా బలంగా గొంతు వినిపిస్తానని జగదీశ్ స్పష్టం చేశారు.
News March 13, 2025
MHBD: మటన్ కోసం మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్టు

మహబూబాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మటన్ కోసం భార్యను మర్డర్ చేసిన వ్యక్తిని సీరోల్ పోలీస్లు గురువారం అరెస్టు చేశారు. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చూసుకునే బాధ్యత అందరి పైన ఉందని పోలీసులు పేర్కొన్నారు.