News April 15, 2024
కేటీఆర్ను కలిసిన వరంగల్ ఎంపీ అభ్యర్థి

వరంగల్ పార్లమెంట్ ప్రస్తుత & మాజీ శాసన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, డా.సుధీర్ కుమార్ సోమవారం కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ నేతలు పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంటామని, అందుకు అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినయ్ భాస్కర్, తదితరులున్నారు.
Similar News
News April 21, 2025
వరంగల్: Wow.. ఆరు తరాల సయింపు వంశీయుల ఆత్మీయ సమ్మేళనం

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారానికి చెందిన సయింపు కుటుంబానికి చెందిన ఆరు తరాల రక్త సంబంధీకులు ఇటీవల ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒకేచోట కలుసుకున్నారు. చదువు, ఉద్యోగ అవసరాల కారణంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు.. కుటుంబ సమేతంగా పాల్గొని, ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించి ఆనందాన్ని పంచుకున్నారు. ఆత్మీయత, బంధుత్వం మరింత బలపడేలా ఈ సమావేశం కలిసొచ్చింది.
News April 21, 2025
పంట పొలాలు, చారిత్రక ఆనవాళ్లు.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత

18 గ్రామాలతో తనదైన అస్తిత్వం, చుట్టూ గ్రామీణ వాతావరణం, చారిత్రక ఆనవాళ్లు, కరవుకు ఎంతో దూరం.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత. నగరానికి కూరగాయలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా దుగ్గొండి మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఎన్నో రోగాలకు దివ్య ఔషధమైన తాటికళ్లును అందించే ప్రాంతంగా దుగ్గొండి గుర్తింపు పొందింది. మండల పరిధి కేశవాపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.
News April 20, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెండ్

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ CP సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. తరిగొప్పుల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బాలాజీ, కానిస్టేబుల్ రాజు ఓ కేసు విషయంలో నిందితుడికి సహకారం అందించేందుకు ప్రయత్నించారు. నిందితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలు విచారణలో రుజువవడంతో వారిని సస్పెండ్ చేశారు.