News December 2, 2025
కేయూలో నాన్ బోర్డర్లకు నిషేధం

కేయూ క్యాంపస్లో నాన్ బోర్డర్ల ప్రవేశాన్ని నిలిపివేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాంపస్లో శాంతి, భద్రత కోసం కొత్త మార్గదర్శకాలు ప్రకటించారు. పుట్టిన రోజులు సహా వ్యక్తిగత వేడుకలు, రాత్రి 9 తర్వాత ఫుట్పాత్లు-బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడాన్ని నిషేధించారు. నాన్ బోర్డర్లు వారం రోజుల్లో హాస్టల్స్ ఖాళీ చేయాలని, బోర్డర్లు తప్పనిసరిగా ఐడీ కార్డు కలిగి ఉండాలన్నారు.
Similar News
News April 15, 2026
విశాఖ జూలో సింహం మృతి

విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది.ఈ వ్యాధుల ప్రభావంతో అవయవాలు పనిచేయకపోవడంతో సింహం మృతి చెందినట్లు జూ క్యూరేటర్ తెలిపారు.
News April 15, 2026
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో వసూళ్లు చేస్తే క్రిమినల్ కేసులు: శ్రీధర్ బాబు

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. మంథనిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మే నెలలో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. నిర్మాణ పురోగతి ఆధారంగానే బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు.
News April 15, 2026
డీలిమిటేషన్.. సరిహద్దులను ఎలా నిర్ణయిస్తారు?

డీలిమిటేషన్తో దేశంలో కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త, పాత నియోజకవర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. నదులు, కొండలు వంటి సహజ సరిహద్దులు, జిల్లాల బార్డర్స్, రవాణా, పరిపాలనా సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి సీటులో సమాన సంఖ్యలో జనాభా ఉండేలా, అసెంబ్లీ సెగ్మెంటు ఏదో ఒక పార్లమెంటు పరిధిలోకి వచ్చేలా చూస్తుంది. SC, ST జనాభా ఎక్కువున్న చోట రిజర్వేషన్ కల్పిస్తుంది.


