News September 11, 2025
కేయూలో నేటి నుంచి పురుషుల కబడ్డీ సెలక్షన్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ పురుషుల కబడ్డీ టోర్నమెంట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ తెలిపారు. గురువారం, శుక్రవారం కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నేతృత్వంలో క్రీడా ప్రాంగణంలో ఎంపికలు చేపడుతున్నట్లుగా స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం కేయూ క్యాంపస్ కళాశాలలో సంప్రదించాలన్నారు.
Similar News
News September 11, 2025
గవర్నర్ పదవికి సి.పి.రాధాకృష్ణన్ రాజీనామా

నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. రేపు ఆయన ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు మహారాష్ట్ర గవర్నర్గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది.
News September 11, 2025
నేపాల్ అల్లర్లు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు ఇవే!

నేపాల్ అల్లర్ల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఢిల్లీ తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. నేపాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్కారు చర్యలు చేపట్టింది. నేపాల్లో ఉన్న మన వాళ్ల గురించి కుటుంబసభ్యులు ఫోన్ చేసి వివరాలుతెలుసుకోవచ్చు. 9871999044, 9643723157, 9949351270 నంబర్లకు ఫోన్ చేయొచ్చు.
News September 11, 2025
MBNR: పశువుల దొంగల అరెస్టు.. రూ.14.50 లక్షలు స్వాధీనం

MBNR(D) నవాబ్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో పశువుల దొంగతనాలు చేసిన నలుగురు నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నెల 2న కేసు నమోదు అయిందన్నారు. నవాబ్పేట్ పోలీసులు కన్మన్ కల్వ గ్రామ శివారులో నేడు పెట్రోలింగ్ చేస్తుండగా.. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను, బొలెరో వాహనం అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ.14,50,000 విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.