News December 22, 2025

కేయూలో బీటెక్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన బీటెక్ 3వ, 5వ, 7వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈనెల 22 నుంచి జరగాల్సిన పరీక్షలను పరిపాలనా కారణాలతో వాయిదా వేసి, డిసెంబర్ 29 నుంచి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. పూర్తి టైం టేబుల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.

Similar News

News January 7, 2026

కామారెడ్డి జిల్లాలో తహశీల్దార్ల బదిలీలు

image

కామారెడ్డి జిల్లాలో MROలను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిట్లం MRO నరేందర్ బాన్సువాడకు బదిలీ అయ్యారు. బాన్సువాడ MRO వరప్రసాద్ కలెక్టరేట్ సూపరిండెంట్‌గా, మహేందర్ పిట్లం MROగా నియమితులయ్యారు. నిజాంసాగర్ MRO భిక్షపతిని పెద్దకొడప్గల్‌కు బదిలీ చేయగా, ఇన్‌ఛార్జిగా ఉన్న అనిల్ కుమార్ ఎల్లారెడ్డి RDO కార్యాలయానికి వెళ్లారు. సవాయి సింగ్‌ను బీర్కూర్‌కు, భుజంగరావు నిజాంసాగర్‌కు బదిలీ అయ్యారు.

News January 7, 2026

ఖమ్మం సీపీఐ సభకు CM రేవంత్

image

సీపీఐ శత వసంతాల ముగింపు వేడుకలకు ఖమ్మం వేదిక కానుంది. ఈనెల 18న స్థానిక ఎస్.ఆర్ & బీ.జీ.ఎన్.ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభకు CM రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక సభలో సీఎం ప్రసంగించనున్నట్లు సీపీఐ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News January 7, 2026

సంగారెడ్డి: పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

image

మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు.