News August 15, 2025

కేయూలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

image

కాకతీయ విశ్వవిద్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రతాప రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో గతేడాది నిర్వహించిన కార్యక్రమాలు, రానున్న రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. రానున్న పోటీ తరానికి ధీటుగా యూజీ, పీజీ విద్యార్థుల సిలబస్‌ను మార్పు చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News August 15, 2025

కృష్ణా: ఫ్రీ బస్సు.. మహిళలు అధిపత్యం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 13 ఆర్టీసీ బస్సు డిపోలలో 1,216 బస్సులు నడుస్తున్నాయి. ప్రతి రోజుకు సగటున 2,30,200 మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నారు. అందులో 1.08 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తుండగా నెలకు 32.4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రయాణికుల్లో పురుషులు 60%, మహిళలు 40% ఉండగా, ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మహిళల శాతం 67%కు పెరగనుంది.

News August 15, 2025

గుంటూరు జిల్లాలో ఫ్రీ బస్సు.. 302 బస్సులు కేటాయింపు

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం కానుంది. అయితే గుంటూరు జిల్లా పరిధిలోని 5 డిపోల్లో 302 బస్సులను స్త్రీ శక్తి పథకానికి కేటాయించినట్లు ఇన్‌ఛార్జ్ RM సామ్రాజ్యం చెప్పారు. ఫ్రీ బస్సు పథకానికి 302 బస్సుల్లో కేటాయించగా వాటిలో 241 పల్లె వెలుగు, 8 అల్ట్రా పల్లె వెలుగు, 53 ఎక్స్‌ప్రెస్ బస్సులను మహిళలకు అందుబాటులో ఉంచామని ఆమె వెల్లడించారు.

News August 15, 2025

జగిత్యాల జిల్లా BJP కార్యవర్గం ఎన్నిక

image

జగిత్యాల జిల్లా బీజేపీ కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడి సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు గురువారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా కృష్ణ హరి, పెద్ద గంగారం, లక్ష్మి, తుకారం గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, అశోక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసన్, శీను, తిరుపతి, కార్యదర్శులుగా లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి, లవన్, కళావతి, పీసు రాజేందర్, రమేష్, కోశాధికారిగా దశరథ రెడ్డితో పాటు తదితరులను ఎన్నుకున్నారు.