News September 24, 2025
కేయూలో LLB 3, 5 మొదటి సెమిస్టర్ పరీక్షలు..!

కేయూలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8, 10, 14, 16, 18వ తేదీల్లో మ.2 గంటల నుంచి సా.5 వరకు జరగనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. అక్టోబరు 9, 13, 15, 17వ తేదీల్లో ఉ.10 నుంచి మ. ఒంటి గంట వరకు ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఇతర వివరాలకు కేయూ వెబ్ సైట్లో చూడాలని సూచించారు.
Similar News
News September 24, 2025
5 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల

జమ్మూకశ్మీర్, పంజాబ్లో ఖాళీగా ఉన్న 5 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్లో 4, పంజాబ్లో ఒక సీటు(ఉపఎన్నిక) ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభం అవుతుంది.
News September 24, 2025
WGL: ఆక్సిజన్ అందక MGMలో పసికందు మృతి

వరంగల్ MGM ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రెండు నెలల పసికందు మృతి చెందింది. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక శిశివు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన ఓ కుటుంబం శిశువును 3 రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకురాగా నేడు మృత్యువాత పడింది. ఆసుపత్రి నిర్వహణ లోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News September 24, 2025
26న పేరెంట్-టీచర్ మీటింగ్

TG: అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో SEP 26న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం కావాలని తెలిపింది. పిల్లల చదువు, హాజరు, ప్రవర్తనపై చర్చించాలని సూచించింది. తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకోవాలంది. నాణ్యమైన విద్య, డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి నెలా ఈ సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది.