News February 20, 2025
కేయూ: పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష వాయిదా

కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రానికి సంబంధించిన <<15507872>>పీజీ మొదటి సెమిస్టర్ పరీక్ష<<>> వాయిదా పడింది. ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఉండటంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను మార్చి 5వ తేదీన నిర్వహిస్తామని, మిగతా పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి, ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
Similar News
News July 5, 2025
నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

వరికుంటపాడు హైవేపై శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో దుత్తలూరు (M) కొత్తపేటకు చెందిన బర్రె రవి, తాళ్లూరి కృపానందం గాయపడ్డారు. తాళ్లూరి కృపానందం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైక్ అదుపు తప్పిందా లేక గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా అనే విషయంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
News July 5, 2025
అమెరికాలో కొత్త పార్టీ.. మస్క్ సన్నాహాలు!

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పాసైతే కొత్త పార్టీ పెడతానని మస్క్ ఇటీవల ప్రకటించారు. తాజాగా <<16891089>>బిల్ <<>>చట్టరూపం దాల్చడంతో ‘అమెరికా పార్టీ’ పెట్టడంపై మస్క్ హింట్ ఇచ్చారు. ‘2 లేదా 3 సెనేట్ సీట్లు, 8-10 హౌస్ డిస్ట్రిక్ట్స్లో ఫోకస్ చేస్తే ఫలితముంటుంది. ప్రజలకు మేలు చేస్తూ వివాదాస్పద చట్టాలపై నిర్ణయాత్మక ఓటు వేయడానికి ఈ సీట్లు సరిపోతాయి’ అని ట్వీట్ చేశారు. పార్టీ లాంచ్కు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి.
News July 5, 2025
అనకాపల్లి: ‘రోజుకు రూ.29 లక్షల ఆదాయం’

అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్ ప్రెస్లు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని డీపీటీవో ప్రవీణ శుక్రవారం తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్స్ ప్రెస్ బస్సులు కాంప్లెక్స్కు వచ్చే విధంగా ఈడీతో సంప్రదిస్తామన్నారు. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం బస్సు డిపోల ద్వారా రోజుకు రూ.29 లక్షల ఆదాయం వస్తోందన్నారు.