News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News October 14, 2025

“బర్త్ రేట్ “లో నెల్లూరు ఎక్కడంటే?

image

రాష్ట్ర వ్యాప్తంగా birth rate ను పరిశీలిస్తే జిల్లాలో 1000 మంది బాలురుకు 1011 మంది బాలికలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. లింగ వివక్షకు సంబంధించి చట్టాలు కఠినంగా ఉండడంతో కొంతమేరా వీటికి అడ్డుకట్ట పడినట్లు తెలుస్తోంది. అయితే ఏదొక మూల వైద్య శాఖ కళ్లు గప్పి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయానేది సమాచారం.

News October 14, 2025

NGKL: ‘పోలీస్ అమరవీరుల’ దినోత్సవం.. వ్యాసరచన పోటీలు

image

అక్టోబరు 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 6వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పాల్గొనవచ్చని ఆయన వివరించారు.

News October 14, 2025

వరంగల్ నిట్‌లో ఆయారే టెక్నోజియాన్

image

వరంగల్ నిట్‌లో సాంకేతిక సంబరం టెక్నీజియాన్-2025 ప్రారంభం కానుంది. ఈనెల 24, 25వ తేదీల్లో నిట్‌లో టెక్నోజియాన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ.2,00,000 విలువైన బహుమతి నిధితో పాటు, రెండు రోజులపాటు ఉత్సాహభరితమైన పోటీలు, సాంకేతిక ప్రదర్శనలు, విభిన్న ఈవెంట్‌లతో నిండి ఉండే ఈ ఉత్సవం, సాంకేతిక పురోగతిని వేడుకగా జరుపుకునే వేదికగా నిలవనుంది.