News March 9, 2025
కేశంపేటకు చేరుకున్న ప్రవీణ్ మృతదేహం

ఇటీవల అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి గంప ప్రవీణ్ మృతదేహం స్వగ్రామం షాద్నగర్లోని కేశంపేటకు చేరుకుంది. తానా సహకారంతో తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు రాగా కుటుంబసభ్యులు స్వగ్రామానికి తరలించారు. గత మంగళవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ప్రవీణ్పై దుండగులు కాల్పులు జరపగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News March 10, 2025
వ్యభిచారానికి అడ్డాగా ఎల్బీనగర్..!

ఎల్బీనగర్లోని పలు ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పలువురు మండిపడుతున్నారు. కామినేని వద్ద లాడ్జీలు, హోటళ్లు వ్యభిచార కేంద్రాలకు అడ్డాగా మారాయని,అధికారులు నిఘా కరవవ్వడంతో ఆడిందే ఆటగా మారిందంటున్నారు. ORR, ఆటోనగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, గుర్రంగూడా, DSNR హైవేలపై రాత్రుళ్లు కొందరు అసభ్యకర దుస్తులతో నిలబడి సైగలు చేస్తూ బాటసారులను ఇబ్బంది పెడుతున్నారు. వీటిని నివారించాలని కోరుతున్నారు.
News March 9, 2025
HYD: యాచారంలో 10 వేల కోళ్లు మృతి

కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న రైతు పౌల్ట్రీ ఫామ్లో పెద్ద సంఖ్యలో కోళ్ల మృతితో రైతు విచారం వ్యక్తం చేశారు. నానక్నగర్లో రైతు చల్లా కృష్ణారెడ్డి పౌల్ట్రీ ఫాంలో అనుకోకుండా ఒక్కసారిగా పదివేల కోళ్లు మృతి చెందాయి. కోళ్లు చనిపోవడంతో దాదాపు రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ఎలాగైనా ప్రభుత్వం, అధికారులు తనను ఆదుకోవాలని కోరారు. గుంతలో కోళ్లను పూడ్చిపెట్టారు.
News March 9, 2025
IND VS NZ: హైదరాబాద్లో ఇదీ పరిస్థితి!

హైదరాబాద్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్లలోని LED టీవీల్లో మ్యాచ్ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.