News April 29, 2024

కేసీఆర్ బస్సు యాత్ర ఏర్పాట్ల పరిశీలన

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం నగరానికి వస్తున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. కేసీఆర్ బస్సు యాత్ర ఖమ్మం కాల్వఒడ్డు నుంచి జెడ్పీ సెంటర్ వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Similar News

News October 2, 2024

ఖమ్మం: డీఎస్సీ అభ్యర్థులకు నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

ఖమ్మం నగరంలో డీఎస్పీ-2024 అభ్యర్థులకు 1:3 నిష్పత్తిలో నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ వర్మ తెలిపారు. రిక్క బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రోటరీ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు. ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.

News October 1, 2024

KMM: దసరా పండుగకు 724 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా TGSRTC సుమారుగా 724 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సరిరామ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం – హైదరాబాద్ మార్గంలో నాన్ స్టాప్ షటిల్ సర్వీసులు నడపబడునని తెలిపారు. ఈనెల 9 నుంచి 11 వరకు హైదరాబాద్ – ఖమ్మం 13, 14 తేదీలలో ఖమ్మం – హైదరాబాద్‌కు నిత్యం తిరిగే 154 బస్సులతో పాటు అదనంగా 100 బస్సులను నడపనున్నట్లు తెలిపారు.

News October 1, 2024

ఖమ్మం: ‘గంజాయి అమ్మిన కొన్నా కఠిన చర్యలు’

image

ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 2.80కోట్ల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు దగ్ధం చేశారు. జిల్లాలోని ఆరు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో 72 కేసుల్లో పట్టుకున్న 1120 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. ఖమ్మం డిప్యూటీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.