News April 18, 2025
కేసీఆర్ సెంటిమెంట్.. WGL, KNR మధ్యలో BRS సభ

KCR సెంటిమెంట్ జిల్లాలైన KNR, WGL జిల్లాల మధ్యలో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. 50వేలకు పైగా వాహనాలు వస్తాయనే అంచనాతో 169ఎకరాలు సభకు, మిగతాదంతా(1,331) పార్కింగ్కు కేటాయించారు. 300 LED స్క్రీన్లు, 15లక్షల మజ్జిగ, 15లక్షల వాటర్ ప్యాకెట్లు, తాత్కాలిక ఆస్పత్రి, అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Similar News
News December 23, 2025
కాంగ్రెస్కు మద్దతు తెలిపితే బెదిరిస్తారు: రాహుల్ గాంధీ

దేశంలోని సంస్థాగత వ్యవస్థలు BJP గుప్పిట్లో ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జర్మనీలో ఉన్న ఆయన ఓ సభలో మాట్లాడారు. ‘ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ED, CBIలు BJPకి ఆయుధాలుగా మారాయి. ఆ పార్టీ నేతలపై ED, CBI కేసులు లేవు. అదే ఓ వ్యాపారవేత్త కాంగ్రెస్కు మద్దతు తెలపాలనుకుంటే అతడిని బెదిరిస్తారు. BJP, ప్రతిపక్షం వద్ద ఉన్న డబ్బు చూడండి’ అని అన్నారు.
News December 23, 2025
కర్నూలు: తల్లి చేసిన పనికి అనాథలైన చిన్నారులు

కర్నూలు(D) ఆస్పరి(M) తొగలగల్లులో <<18638430>>దారుణం<<>> జరిగింది. 4 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్త అహోబిలాన్ని భార్య గంగావతి(30) గొంతు నులిమి చంపింది. ఈ కేసులో బెయిల్పై వచ్చిన గంగావతి భర్త స్వగ్రామమైన తొగలగల్లులో ఉంటోంది. దీన్ని మృతుడి తమ్ముడు పెద్దయ్య జీర్ణించుకోలేకపోయాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తలపై రోకలి బండతో కొట్టడంతో మృతిచెందింది. అహోబిలం, గంగావతి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
News December 23, 2025
ఆయిల్పామ్తో అధిక ఆదాయం.. సాగుకు సర్కారు ప్రోత్సాహం

తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దేశీయ అవసరాల కోసం ఈ పంట సాగుకు ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. కేవలం పామాయిల్తోనే కాకుండా దానిలో పసుపు, అల్లం, మిర్చి, మొక్కజొన్న, అరటి, కోకో, మిరియాలు వంటి అంతర పంటలతో అదనపు ఆదాయం పొందొచ్చు. ఈ పంట సాగుకు AP, తెలంగాణ ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


