News October 11, 2024
కేసీఆర్ 5వేల స్కూళ్లను మూసేశారు: సీఎం

TG: పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ విద్యపై దృష్టి పెట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతో దాదాపు 5వేల స్కూళ్లను మూసేశారని ఆరోపించారు. పేదలు చదువుకుంటే బానిసలుగా ఉండరనేది కేసీఆర్ ఆలోచన అని మండిపడ్డారు. తాము విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని సీఎం వివరించారు.
Similar News
News September 14, 2025
‘వాహనమిత్ర’కు ఎవరు అర్హులంటే?

AP: <<17704079>>వాహనమిత్ర<<>> కింద రూ.15 వేలు పొందాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలో ఒక్క వాహనానికే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, IT కట్టేవారు ఉండకూడదు. సిటీల్లో 1000 చ.అ.లకు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. AP రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లుండాలి. కరెంట్ బిల్లు నెలకు 300యూనిట్లలోపు రావాలి.
News September 14, 2025
వరి: సెప్టెంబర్లో కలుపు, చీడపీడల నివారణ

* నాటిన 12 రోజులకు వరి పొలంలో కలుపు ఉంటే సైహలోఫాప్-పి-బ్యులైల్ 1.5ML లేదా బిస్ఫైరిబాక్ సోడియం 0.5ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* అగ్గి తెగులు: ఐసోప్రోథయోలేన్ 1.5ML లేదా కాసుగామైసిన్ 2.5ML లేదా ట్రైసైక్లజోల్+మ్యాంకోజెబ్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పాముపొడ తెగులు: హెక్సాకొనజోల్ 2ML లేదా ప్రొపికొనజోల్ 1ML లేదా వాలిడామైసిన్ 2ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News September 14, 2025
368 పోస్టులకు RRB నోటిఫికేషన్

<