News April 1, 2025

కేసీ వేణుగోపాల్‌ను కలిసిన ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్యేలు

image

ఢిల్లీలో ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేలంతా కలిసినట్లు సమాచారం. కలిసిన వారిలో ఎమ్మెల్యేలు టీ. రాంమోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య ఉన్నారు.

Similar News

News July 6, 2025

ఆ హక్కు దలైలామాకు లేదు: చైనా రాయబారి

image

తన వారసుడిని ఎంపిక చేసే హక్కు బౌద్ధ మత గురువు దలైలామాకు లేదని భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ స్పష్టం చేశారు. పునర్జన్మ విధానంలో దలైలామా ఓ భాగం మాత్రమేనని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ప్రస్తుతం చైనా టిబెట్, సిచువాన్, యునాన్, గన్సు, క్విగ్ హాయ్ ప్రావిన్సుల్లో 1,000 రకాల పునర్జన్మ విధానాలు అనుసరిస్తున్నారు. ఈ సంప్రదాయాలు దలైలామాతో ప్రారంభం కాలేదు. అలాగే అంతం కూడా కాలేదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

News July 6, 2025

GHMC ఆస్తులపై DGPS సర్వే

image

గ్రేటర్ HYDలో GHMC ఆస్తుల డీజీపీఎస్ సర్వేకు రంగం సిద్ధమైంది. చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో స్థిరాస్తులు, ఓపెన్ లేఅవుట్లు, పార్కులు, స్థలాలు కమ్యూనిటీ హాల్స్ సహా అన్ని వివరాలను సర్వే చేయించనున్నారు. సర్వే డిజిటలైజేషన్ కోసం కన్సల్టెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది. కార్యాలయ భవనాల నుంచి మున్సిపల్ షాపుల దాకా అన్ని వివరాలు పొందుపరచునున్నారు.

News July 6, 2025

భద్రకాళి ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

image

భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపికి ఏఎస్పీ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.