News September 26, 2024

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పోలీస్ కార్యాలయంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌కు సంబంధించి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరు, పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించాలి.

Similar News

News September 29, 2024

‘కర్నూలు విమానాశ్రయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’

image

కర్నూలు విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విమానాశ్రయంలో మహిళా పోలీసులను కూడా నియమించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

News September 28, 2024

CM పర్యటన ఏర్పాట్లపై కర్నూలు కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమడలో అక్టోబర్ 1న CM చంద్రబాబు పర్యటించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో CM పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. CM పర్యటన ఏర్పాట్లపై శనివారం జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి పాల్గొన్నారు.

News September 28, 2024

తప్పు చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు: మాజీ మంత్రి బుగ్గన

image

స్వామి వారి లడ్డూ కల్తీ జరిగినట్లయి ఆ దేవుడు కూడా ఎవరినీ క్షమించడని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్‌లో శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదంపై మీడియాతో మాట్లాడారు. వారికి అనుకూలమైన అధికారులు, లాబోరేటరీలో పరీక్షలు చేయించి, రిపోర్టులు సేకరించి, గత ప్రభుత్వంపై నిందలు వేయడం మంచిది కాదన్నారు.