News March 4, 2025

కైకలూరు: కూలి పనులకు వెళ్లి పాముకాటుకు గురైన యువకుడు

image

కూలి పనికి వెళ్లిన యువకుడు పాముకాటుతో మృతి చెందాడు. మండలంలోని శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ జాన్ పదో తరగతి పూర్తి చేశాడు. గుంటూరు(D) అమరావతిలో చేపల పట్టుబడికి ఆదివారం సాయంత్రం 11 మంది గ్రామస్థులతోపాటు మత్స్యకార కూలీగా అతనూ వెళ్లాడు. వీరంతా అర్ధరాత్రి సమయంలో అక్కడకు చేరుకోవడంతో పాకలో నిద్రపోయారు. నిద్రలో ఉన్న జాన్‌ను విషసర్పం కాటు వేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News March 4, 2025

తాడ్వాయి: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

image

తాడ్వాయి మండలం దేమికాలన్ గ్రామానికి చెందిన బంగారు గళ్ల అభిజిత్(24) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. పనిచేయకుండా తిరుగుతున్న అభిజిత్‌ను నానమ్మ పనిచేయాలని చెప్పడంతో మనస్తాపానికి గురైన అభిజిత్ ఈనెల 1న పురుగు మందుతాగాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.

News March 4, 2025

IT బిజినెస్ మోడల్ పనైపోయింది: HCL టెక్ CEO

image

భారత ఐటీ ఇండస్ట్రీ 30 ఏళ్లుగా అనుసరిస్తున్న సంప్రదాయ బిజినెస్ మోడల్ పనైపోయిందని HCL టెక్ CEO విజయ్ కుమార్ ప్రకటించారు. AI విజృంభణతో ఈ మోడల్ పాతబడిందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు తగినట్టు ఉండాలన్నా, మెరుగైన వృద్ధి కావాలన్నా కంపెనీల మైండ్‌సెడ్ మారాలని స్పష్టం చేశారు. AIని వాడుకొని ప్రొడక్షన్ పెంచాలని, సగం ఉద్యోగులతోనే రెట్టింపు రెవెన్యూ సృష్టించాలని తమ టీమ్స్‌ను సవాల్ చేస్తున్నామని తెలిపారు.

News March 4, 2025

విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్‌దే: మంత్రి గొట్టిపాటి

image

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అంశాన్ని మండలి ప్రశ్నోత్తరాల్లో YCP సభ్యులు ప్రస్తావించారు. దీనికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, పెంచబోదని స్పష్టం చేశారు. ఛార్జీల పెంపు పాపం జగన్‌దేనని విమర్శించారు. ఐదేళ్లలో 9సార్లు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

error: Content is protected !!