News January 2, 2026
కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాక.. అభివృద్ధికి బాట!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఆంజనేయ స్వామి వెలసిన కొండపై నిద్రిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకంతో వచ్చే భక్తులకు, కొండపైకి చేరుకోగానే సరైన గదులు లేక ఆలయ పరిసరాల్లో నేలపై నిద్రిస్తూ అవస్థలు పడ్డారు. భక్తుల మొర ఆలకించిన పవన్ 96 గదుల సత్ర నిర్మాణానికి శనివారం భూమి పూజ చేయనున్నారు. దీంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి.
Similar News
News January 6, 2026
రాష్ట్రంలో 1095 పోస్టులకు నోటిఫికేషన్

AP: <
News January 6, 2026
ఏపీలో వేగంగా ఎయిర్పోర్టులు!

ఏపీలో విమానాశ్రయాల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, పుట్టపర్తిలో డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇటీవలే విజయవాడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. రాజమండ్రిలో పనులు జరుగుతుండగా, భోగాపురంలో పూర్తి కావొచ్చింది. కొత్తగా కుప్పం, దొనకొండ (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు)లో ఎయిర్పోర్టులకు ప్లాన్ చేస్తున్నారు.
News January 6, 2026
PDPL: అనాథ పిల్లలందరూ చదువుకోవాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలోని అనాథ, పాక్షిక అనాథ పిల్లలందరూ విద్యకు దూరం కాకుండా చూడాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఐసీపీఎస్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన ఆయన, పిల్లల తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తులను వారికే దక్కేలా చూడాలన్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక సీట్లు కేటాయించాలని, బాలసదనంలో మెరుగైన వసతులతో పాటు బెడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


