News April 8, 2025

కొండగట్టులో నాసిరకం ప్రసాదం.. ప్రజావాణిలో ఫిర్యాదు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో పులిహోర, అన్న ప్రసాదంలో నాసిరకం సరకులు వినియోగిస్తున్నారని కొండగట్టు మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు పోచమ్మల ప్రవీణ్ సోమవారం జగిత్యాల కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రానున్న హనుమాన్ జయంతికి లక్షలాదిమంది వస్తుండగా వారికి నాసిరకం వస్తువులతో తయారు చేసిన పులిహోర, లడ్డు, అన్నప్రసాదం అందజేస్తే ఆలయ ప్రతిష్ఠ దిగజారే అవకాశం ఉందన్నారు.

Similar News

News April 17, 2025

KNR: భూభారతి రెవెన్యూ చట్టంపై అవగాహన సదస్సులు

image

భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.17న తిమ్మాపూర్, గన్నేరువరం, 19న హుజురాబాద్, 22న రామడుగు, గంగాధర, 23న చొప్పదండి, 24న మానకొండూర్, శంకరపట్నం, 25న జమ్మికుంట, ఇల్లందకుంట, 26న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, 29న చిగురుమామిడి, సైదాపూర్, 30న వీణవంక మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు.

News April 17, 2025

ఇల్లందకుంట జాతర బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు

image

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిసాయని ఈఓ సుధాకర్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుండి 16 ఏప్రిల్ వరకు వైభోపేతంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకల హుండీలను దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 22 ఏప్రిల్ 2025న ఉదయం 9గంటలకు లెక్కించనున్నట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో పాల్గొనే భక్తులు డ్రెస్ కోడ్‌లో రావాలని సూచించారు.

News April 17, 2025

KNR బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్

image

KNR బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్టేట్ జాయింట్ కన్వీనర్ భూక్య రజనీష్, జిల్లా లీగల్ సెల్ ఛైర్మన్ కల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఎన్నికల వివరాలను తెలుసుకుని అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజును మంత్రి పొన్నం ప్రత్యేకంగా అభినందించారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.

error: Content is protected !!