News February 28, 2025
కొండగట్టులో పలు వ్యాపారాలకు టెండర్

జిల్లాలోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవాళ పలు వ్యాపారాలకు అధికారులు ఈ, సిల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయలు అమ్ముకునే హక్కుకు రూ. 1,50,00,000, పుట్నాలు, పేలాలు అమ్ముకునే హక్కుకు రూ. 27,70,000, పూలు, పండ్లు అమ్ముకునే హక్కుకు రూ.40,00,000, గాజులు ప్లాస్టిక్ ఆట వస్తువులు అమ్ముకునే హక్కు రూ.32,00,000 లతో హెచ్చు పాటాదారులు దక్కించుకున్నారు.
Similar News
News February 28, 2025
GWL: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: సీఎస్

మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాల్లోనికి మొబైల్స్ అనుమతించరాదన్నారు. గద్వాల కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News February 28, 2025
రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం: రేవంత్

TG: రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ నేతల లక్ష్యమని CM రేవంత్ అన్నారు. అప్పటివరకు కార్యకర్తలు విశ్రమించవద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇన్ని చేస్తే కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేయగలమో ఆలోచించాలని కార్యకర్తలకు సూచించారు.
News February 28, 2025
TPCC రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే

హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, DCC అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు లబ్ధి పొందుతున్న తీరుపై వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, CM రేవంత్ రెడ్డి, అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.