News April 10, 2025
కొండగట్టు ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు

ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఉత్సవ కమిటీ ఇవాళ ఏర్పాటైంది. ఛైర్మన్తో పాటు 11 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎండోమెంట్ కమిషనర్కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఉత్సవ కమిటీ సభ్యులు కొండగట్టు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదం అందజేశారు.
Similar News
News September 19, 2025
HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.
News September 19, 2025
నెల్లూరు: ఏడుగురి మృతి.. ముగ్గురిపై కేసు

సంగం మండలం పెరమన వద్ద కారును ఇసుక టిప్పర్ ఢీకొని ఏడుగురు చనిపోయిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఏ1గా టిప్పర్ డ్రైవర్, ఏ2గా టిప్పర్ యజమానిని, ఏ3గా బుజ్జినాయుడు పేర్లు నమోదు చేశారు. బుజ్జినాయుడిని ఇసుక వ్యాపారిగా పోలీసులు భావిస్తున్నారు. ఇసుకను ఆత్మకూరు వైపు నుంచి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆత్మకూరు పరిధిలో ప్రస్తుతం ఏ ఇసుక రీచ్కు అనుమతులు లేకపోవడం గమనార్హం.
News September 19, 2025
తిరుపతి: రూ.15వేల సాయం.. నేడే లాస్ట్ ఛాన్స్

వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకొనే ప్రయత్నం చేస్తోంది. నూతన వాహన మిత్ర దరఖాస్తులకు నేడు చివరితేది కాగా 22వ తేదీన అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 42,098 ఆటోలు ఉండగా తిరుపతి RTA పరిధిలో 29,900, గూడూరు పరిధిలో 12,198 ఆటోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్క్రూట్నీ అనంతరం అర్హుల జాబితా వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.