News February 27, 2026
కొండగట్టు ఆలయ ఖజానాకు భారీ ఆదాయం

కొండగట్టు అంజన్న క్షేత్రంలో తలనీలాల వేలం ద్వారా దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది. గురువారం నిర్వహించిన ఈ వేలంపాట మధ్యాహ్నం నుంచి రాత్రి 10 వరకు కొనసాగింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సాగిన ఉత్కంఠభరిత వేలంలో తొలుత హైదరాబాద్కు చెందిన రాజా ఎంటర్ప్రైజెస్ రూ.2.70 కోట్లు పాడగా.. అంతిమంగా తణుకుకు చెందిన ఇండియన్ హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.4.44 కోట్లకు టెండర్ను దక్కించుకుంది.
Similar News
News February 27, 2026
మన్యం: గురుకులంలో డయేరియా కలకలం

కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. 6 తరగతి విద్యార్థినులు మండంగి హేమలత, కోలక అనసూయ, కొండగొర్రె అనుశ్రీ అస్వస్థతకు గురై పాఠశాలలోనే చికిత్స పొందుతున్నారు. ఆరిక, ప్రణవి, శృతి దేవిలను సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తాగునీరు, ఆహార పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
News February 27, 2026
ఏయూలో మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై కఠిన చర్యలు: లోకేశ్

గత ప్రభుత్వంలో ఆంధ్రా యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో మండిపడ్డారు. వర్సిటీలో అక్రమ నియామకాలపై మ్యాన్ పవర్ ఆడిట్ చేస్తున్నామని, నెల రోజుల్లో అనర్హులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆడిట్ తర్వాతే కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్ నివేదిక రాగానే కఠిన చర్యలు తప్పవన్నారు.
News February 27, 2026
BREAKING: అకౌంట్లలోకి డబ్బులు

TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ బిల్లులు రూ.745 కోట్లను విడుదల చేసింది. వెంటనే వారి అకౌంట్లలో జమ చేయనుంది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా గత ఏడాది జూన్ నుంచి ప్రతి నెలా దాదాపు రూ.700 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోంది. మరోవైపు గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు మరో రూ.389 కోట్లను రిలీజ్ చేసింది.


