News September 6, 2025
కొండగట్టు: సెప్టెంబర్ 7న ఆలయం మూసివేత

ఈనెల 7న (ఆదివారం) రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్ని ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం సెప్టెంబర్ 8న (సోమవారం) పుణ్యహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనం, ఆరాధన, ఉదయం 7 గంటల నుంచి యధావిధిగా భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు ప్రారంభమవనున్నాయన్నారు.
Similar News
News September 6, 2025
రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలి: మంత్రి

TG: రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయాను కోరినట్లు మంత్రి వాకాటి శ్రీహరి చెప్పారు. గతంలో CM రేవంత్ కూడా దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేశారన్నారు. TGలోని పలు జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూళ్ల అభివృద్ధి, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటిస్తానని కేంద్ర మంత్రి చెప్పారని శ్రీహరి వెల్లడించారు.
News September 6, 2025
వరంగల్ వాసికి నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ వాసికి నేషనల్ బెస్ట్ టీచర్స్ అవార్డు వరించింది. హన్మకొండ 57వ డివిజన్ గోకుల్ నగర్ వాస్తవ్యురాలు నక్క స్నేహలత యాదవ్ శుక్రవారం ఢిల్లీలో మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ & ఎంటర్ప్యనర్షిప్ గవర్నమెంట్ అఫ్ ఇండియా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆమె NAC సీనియర్ ఫాకల్టీగా పనిచేస్తున్నారు.
News September 6, 2025
గణపతి నిమజ్జనంలో పాల్గొన్న కలెక్టర్ సత్య శారద

వరంగల్ నగరంలోని ఉర్సు రంగసముద్రంలో నిర్వహిస్తున్న నిమజ్జన కార్యక్రమాంలో కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. నగరంలోని నిమజ్జన ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.