News March 31, 2024
కొండపి: చెట్టును ఢీ కొట్టిన బైక్.. ఒకరు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711894551033-normal-WIFI.webp)
కొండపి మండలంలోని నేతివారిపాలెం సాయిబాబా గుడి వద్ద ప్రమాదం జరిగింది. చీమకుర్తి మండలానికి చెందిన ఇద్దరు యువకులు జరుగుమల్లి మండలం కామేపల్లి పోలేరమ్మ గుడికి బైక్పై వెళ్లి వస్తూ మద్యం మత్తులో చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో రాగం చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తరలించారు. ఘటనా స్థలాన్ని కొండపి ఎస్సై కృష్ణబాజీ పరిశీలించారు.
Similar News
News July 5, 2024
యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ సస్పెండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720164624881-normal-WIFI.webp)
యర్రగొండపాలెం ఎస్సై సుదర్శన్ ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ విచారణకు ఆదేశించారు. దీంతో మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు ఆధ్వర్యంలో విచారణ జరిపిన అనంతరం ఆ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు.
News July 5, 2024
చీమకుర్తి : నూడుల్స్ తింటూ వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720159790603-normal-WIFI.webp)
చీమకుర్తిలోని ఓ రెస్టారెంటులో గురువారం రాత్రి నాగశేషులు అనే వ్యక్తి మృతి చెందాడు. రాత్రి 9 గంటల సమయంలో నాగశేషులు పట్టణంలోని ఓ రెస్టారెంట్కి వచ్చి నూడుల్స్ ఆర్డర్ చేసి కొంత వరకు తిన్నాడు. తింటుండగానే కుర్చీలోనే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం ఆత్మకూరుగా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2024
పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా ఎంపీ మాగుంట
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720161008555-normal-WIFI.webp)
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిని పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా శుక్రవారం ప్రకటించారు. పార్లమెంటు సభా ప్రాంగణంలో ఒంగోలు ఎంపీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హౌస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఎంపీ మాగంటకు సహచర ఎంపీలు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు.