News March 12, 2026
కొండమల్లేపల్లిలో 60 సిలిండర్లు సీజ్

కొండమల్లేపల్లిలో పౌర సరఫరాల శాఖ అధికారులు హోటల్, రెస్టారెంట్, దాబాలపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమంగా వినియోగిస్తున్న 60 సిలిండర్లను సీజ్ చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ముబీన్, దీపక్, సైదులు, ముక్తర్, జ్యోతి, కుమార్ పాల్గొన్నారు.
Similar News
News April 10, 2026
సాగర్ నర్సింగ్ కళాశాలకు పునర్జీవం

నిధుల కొరతతో మూతపడిన నల్గొండ జిల్లాలోని సాగర్ నర్సింగ్ కళాశాల పునఃప్రారంభానికి ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. సుమారు రూ.13కోట్లతో ఈ విద్యాసంస్థను ఆధునీకరించనున్నారు. నూతన భవనంతో పాటు అత్యాధునిక వసతులు కల్పించి, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను చేరువ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, విద్యార్థులకు మేలు చేకూరనుంది.
News April 10, 2026
నల్గొండ జిల్లా ఆసుపత్రిలో ఇంప్లాంట్ల కొరత

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలకు వినియోగించే ఇంప్లాంట్ల కొనుగోలు వ్యవహారం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. టెండర్ల గడువు ముగిసి నెలలు గడుస్తున్నా, నిబంధనల ప్రకారం కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేయకుండా పాత వారికే పనులు కట్టబెట్టాలని అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సరఫరా ప్రక్రియ స్తంభించిపోవడంతో ఆసుపత్రిలో ఇంప్లాంట్ కొరత ఏర్పడింది.
News April 10, 2026
నేటి నుంచి భౌతిక, జీవశాస్త్ర సబ్జెక్టుల మూల్యాంకనం

పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో భాగంగా నేటి నుంచి 17వ తేదీ వరకు భౌతిక, జీవశాస్త్రాల సబ్జెక్టుల మూల్యాంకనం షురూ కానుంది. వాటికి సంబందించి అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్పెషల్ అసిస్టెంట్ ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయులంతా ఇవాళ ఉదయం 9 గంటలోగా నల్గొండలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల స్పాట్ వాల్యూయేషన్ కేంద్రానికి హాజరు కావాలని డీఈవో బిక్షపతి ఆదేశాలు జారీ చేశారు.


